పైరసీని ప్రొత్సహించవద్దు

` ‘ఐ బొమ్మ’ రవితో సినీ పరిశ్రమకు తీరని నష్టం
`అతడి హార్డ్‌ డిస్క్‌లో 21 వేలకు పైగా సినిమాలు
` బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేసేలా పైరసీ
` తద్వారా రూ.20 కోట్లు సంపాదన
` రూ.3 కోట్లు అకౌంట్‌లో ఫ్రీజ్‌ చేశాం: సీపీ సజ్జనార్‌
` సినీ కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న పైరసీకారులు
` ఐబొమ్మ రవి అరెస్‌తో అప్రమత్తం కావాలి
` పైరసీ ద్వారా వ్యక్తిగత సమాచారం కూడా చోరీ
` కమిషన్‌ను కలిసి అభినందించిన సినీ పెద్దలు
హైదరాబాద్‌(జనంసాక్షి): పైరసీతో సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగిందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ అన్నారు. పైరసీని అరికట్టే క్రమంలో ఐ బొమ్మ రవిని అరెస్ట్‌ చేశామన్నారు. ఐ బొమ్మ రవిపై మూడు పైరసీ కేసులున్నాయని తెలిపారు. రవి.. వెబ్‌ సైట్‌ డిజైన్‌, డెవలపింగ్‌లో ఆరితేరాడని, సీక్రెట్‌ కెమెరాలతో కొత్త సినిమాలను పైరసీ చేస్తాడని తెలిపారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు ఛాలెంజ్‌ చేసిన ఐ బొమ్మ రవి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. రవి అరెస్ట్‌పై సీపీ సజ్జనార్‌ సినీ ప్రముఖులతో కలిసి విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పైరసీపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఐ బొమ్మ రవి హార్డ్‌ డిస్క్‌ లలో దాదాపు 21 వేలకు పైగా సినిమాలు ఉన్నాయని తెలిపారు. పైరసీ ద్వారా రవి రూ. 20 కోట్లు సంపాదించాడని, అందులో రూ. 3 కోట్లు ఫ్రీజ్‌ చేశామని చెప్పారు. రవికి ఇంటర్నేషనల్‌ లింక్స్‌ ఉన్నాయని, ఈ కేసు చేధించేందుకు జాతీయ స్థాయి సంస్థల సహకారం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐ బొమ్మ రవి దగ్గర 50 లక్షల మంది సమాచారం ఉందని వెల్లడిరచారు. డేటా కలెక్షన్‌ కోసం ఐ బొమ్మ రవి మాస్టర్‌ మైండ్‌ ఉపయోగించాడని సీపీ వివరించారు. ఒక సైట్‌ను బ్లాక్‌ చేస్తే.. మరో సైట్‌ను డెవలప్‌ చేస్తాడని వెల్లడిరచారు. రవి సైట్‌ ఓపెన్‌ చేయగానే బెట్టింగ్‌ యాప్స్‌ అట్రాక్ట్‌ చేస్తాయని, బెట్టింగ్‌ యాప్స్‌తో జనం వేల కోట్లు నష్టపోయారని వ్యాఖ్యానించారు. కస్టడీకి ఇస్తే ఐ బొమ్మ రవి నుంచి పూర్తి వివరాలు రాబడుతామని, ఆయన నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా వారిని కూడా అరెస్ట్‌ చేస్తామని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే సోమవారం హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో సినీ పెద్దలు భేటీ అయ్యారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జునలతో పాటు దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్‌రాజు, దగ్గుబాటి సురేశ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌కైమ్ర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సజ్జనార్‌ విూడియాతో మాట్లాడారు. పైరసీతో సినీ రంగానికి చాలా నష్టం జరిగిందని తెలిపారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిపై ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి చాలా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నాడు. దీంతో చాలా మంది చనిపోయారు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేస్తే కొత్త సైట్‌ను తయారు చేశాడు. ఇలా65 మిర్రర్‌ వెబ్‌సైట్లు నిర్వహించాడు. 21 వేల సినిమాలు అతడి హార్డ్‌ డిస్క్‌లో ఉన్నాయి. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్‌ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. రూ.20 కోట్లు పైరసీ ద్వారా సంపాదించాడు. అందులో రూ.3 కోట్లు సీజ్‌ చేశాం. 50 లక్షల మంది సబ్‌స్కైబ్రర్ల డేటా రవి వద్ద ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం. దీన్ని సైబర్‌ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందని సజ్జనార్‌ వెల్లడిరచారు. విశాఖకు చెందిన ఇమ్మడి రవి బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాడు. అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డులు తీసుకున్నాడు. మొదటి నుంచి నేర ప్రవృత్తితో ఉన్నాడు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతడి వెంట పడ్డారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్‌ దీవుల్లో ఉన్న సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21 వేల సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో సర్వర్లను పెట్టాడు. 110 డొమైన్స్‌ కొనుక్కున్నాడు. ఒకటి బ్లాక్‌ చేస్తే మరొకటి ఓపెన్‌ చేస్తూ పైరసీ సినిమాలు విడుదల చేశాడు. ఈ రాకెట్‌లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం అని సజ్జనార్‌ తెలిపారు. ఇదిలావుంటే ఈ కేసులో కీలకంగా వ్యవహరించి రవిని అరెస్ట్‌ చేసిన పోలీస్‌లను సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి తదితరులు సన్మానించారు.
సినీ కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న పైరసీకారులు
సినీ ఇండస్టీ విూద చాలామంది ఆధారపడి ఉన్నారని వాళ్ల కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని చిరంజీవి అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్‌ నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు హైదరాబాద్‌ నగర సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. ఈ విూటింగ్‌ అనంతరం చిరంజీవి మాట్లాడారు. అంతకుముందు సౌదీ ప్రమాదంలో మృతులకు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ పైరసీ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నాం. ఇండస్టీ విూద పరోక్షంగా, ప్రత్యక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్నారు. లైట్‌బాయ్‌ దగ్గర నుంచి పెద్దపెద్ద డైరెక్టర్ల వరకూ ఇండస్టీప్రై ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకోవడం.. తిరిగి పోలీసులకే సవాలు విసరడాన్ని తట్టుకోలేకపోయాం. ఇలాంటి సమయంలో గత సీపీ సీవీ ఆనంద్‌ అనంతరం సజ్జనార్‌ చాలా కృషి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో పనిచేసిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలి, పైరసీ చూడొద్దు. ఈ ఏడాది కూడా చాలా సినిమాలు పైరసీ చేశారు. దీనివల్ల ఎంతో నష్టం జరిగింది. త్వరలో రాజమౌళి గొప్ప సినిమా తీయనున్నారు. అప్పుడు మన ఖ్యాతి ఖండాంతరాలు విస్తరిస్తుంది. ఆ సమయంలోను పైరసీ పెనుసవాలుగా ఉంటుంది. ఇండస్టీ బాధను అర్థం చేసుకున్నందుకు పోలీసులను అభినందిస్తున్నట్లు చిరంజీవి అన్నారు. పోలీసులకు ధన్యవాదాలు. ఇది సినిమాలో సూపర్‌ హిట్‌ సన్నివేశంలా ఉంది. విలన్‌ ఛాలెంజ్‌ చేస్తే రెండు నెలల తర్వాత హీరో అతడిని కటకటాల వెనక వేసినట్లు ఉంది. భస్మాసురుడి హస్తంలా తన తలవిూద తనే చేయిపెట్టుకున్నాడు. పోలీసులతో ఆటలొద్దు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. ఏదీ ఉచితంగా రాదు. ఒకవేళ అలా వస్తే దాని వెనక పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది. అది చావు వరకూ తీసుకెళ్తుంది. ’సినిమాలేగా ఏముంది ఫ్రీగా చూస్తున్నాం’ అని అందరూ అనుకుంటున్నారు. పైరసీ చేసే వాళ్లేం సంఘసేవ చేయడం లేదు. పెద్దపెద్ద సర్వర్లు ఉపయోగించి పైరసీ చేస్తున్నారు. దానికి డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? మేము వాళ్లకు డబ్బులు ఇవ్వడం లేదు.. మా సినిమాలను పైరసీ చేసి సంపాదిస్తున్నారు. అంటే విూరు ఇస్తున్నారు. విూ వ్యక్తిగత డేటాను అమ్మడం వల్ల ఇస్తున్నారు. ఈ పర్సనల్‌ డేటా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. విూ పేరు, ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, ఈ`మెయిల్‌ ఐడీ ఉంటే చాలు విూరు సైబర్‌ బారిన పడతారు. ఈ డేటాను క్రిమినల్స్‌కు అమ్ముతున్నారు. విూరు నంబరే కదా అని ఎంటర్‌ చేస్తున్నారు. దాని మూలంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. డబ్బులు పోవడమే కాదు.. ప్రాణాలు పోయే వరకూ వెళ్తోంది. ఈ పైరసీ వల్ల మాకంటే విూరే ఎక్కువ నష్టపోతున్నారు. అర్థం చేసుకోండి. ఇలాంటి పైరసీ వెబ్‌సైట్లలో ఉచితంగా సినిమాలు చూసి ఇబ్బందుల్లో పడకండని రాజమౌళి సినీ అభిమానులకు సూచించారు.
సైబర్‌ కైమ్ర్‌ పోలీసుల కృషి అభినందనీయం: హోం స్పెషల్‌ సెక్రటరీ ఆనంద్‌
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ని హైదరాబాద్‌ సైబర్‌ కైమ్ర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. పోలీసులకు దమ్ముంటే తనను పట్టుకోవాలని కొన్ని రోజుల ముందు ఇమ్మడి రవి సవాల్‌ చేశాడు. ఆయన కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇమ్మడి రవి అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్‌ సీఎస్‌ సీవీ ఆనంద్‌ స్పందించారు. రవి అరెస్ట్‌పై సోషల్‌ విూడియా మాధ్యమం ఎక్స్‌ వేదికగా సీవీ ఆనంద్‌ ట్వీట్‌ పెట్టారు.దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని హైదరాబాద్‌ సైబర్‌ కైమ్ర్‌ పోలీసులు పట్టుకున్నారని సీవీ ఆనంద్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ సైబర్‌ కైమ్ర్‌ పోలీసులకు అభినందనలు తెలిపారు. ఇమ్మడి రవిని పట్టుకోవడానికి జూన్‌ నుంచి సైబర్‌ కైమ్ర్‌ టీమ్‌ రేయింబవళ్లు కష్టపడిరదని ప్రశంసించారు. రవిని తప్పా ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుందని గుర్తుచేశారు. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేశారని కొనియాడారు. డీసీపీ కవిత, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌లని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సీవీ ఆనంద్‌.

క్షమించండి..మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేశాం
` ఐ బొమ్మ ప్రకటన
హైదరాబాద్‌(జనంసాక్షి): ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్ల నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయిన నేపథ్యంలో ఐ బొమ్మ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని వెబ్‌సైట్లో వెల్లడిరచింది. కొత్త సినిమాలు, ఓటీటీ వేదికల్లోని కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన నిందితుడు రవిని శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐ బొమ్మ, దాని అనుబంధంగా ఉన్న 65 వెబ్‌సైట్లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బ్లాక్‌ చేశారు. ‘‘మీకు ఇటీవల మా గురించి తెలిసి ఉండొచ్చు. లేదంటే.. మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండొచ్చు. ఏదేమైనా.. మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’’ అని ఐ బొమ్మ ప్రకటనలో పేర్కొంది.గత ఏడెనిమిదేళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ఐ బొమ్మను వేదికగా మార్చిన ఇమ్మడి రవి (40)ని శనివారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్ట్‌ చేశారు. ఇతడు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో రూ.3 కోట్ల నగదు, వందల కొద్దీ హార్డ్‌ డిస్క్‌లు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్లను గుర్తించినట్టు సమాచారం. నిందితుడిని బషీర్‌బాగ్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌)కు తరలించి కీలక సమాచారం సేకరించారు. అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.