పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడిపై దాడి

రామన్నపేట పద్మశాలి సంఘం పట్టణ  అధ్యక్షుడు రచ్చ యాదగిరి పై శుక్రవారం కొంతమంది దాడికి పాల్పడ్డారు. సహకార సంఘంలో సభ్యత్వం లేని వారికి ప్రభుత్వం అందించే ఎన్ హెచ్ డి పి క్లస్టర్ పథకం కింద లబ్ధి పొందుటకు అనర్హుల పేర్లు జాబితాను తయారుచేసి కొంతమంది లబ్ధి పొందాలని చూసారని అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. ఈ విషయం గత నెల 17న జిల్లా సహాయ సంచాలకులు కు విచారణ చేయాలని తాను తన కార్యవర్గ సభ్యులందరూ కలిసి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం విచారణ చేయటానికి సమంత అధికారులను రావడం జరిగిందన్నారు. స్వలాభం చూసుకునే కొంతమంది విచారణకు అధికారులను రప్పిస్తారా అంటూ తనపై దాడికి పాల్పడి కొట్టారని తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తగు న్యాయం చేయాలని ఆయన కోరారు.