పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. విద్యార్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సలును ఆయా సెంటర్లకు, గ్రామాలకు నడుపుతన్నారు. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా విద్యాధికారి  చెప్పారు. విద్యార్థులు కూడా కొన్ని కేంద్రాల్లో చూచిరాతలు రాస్తున్నారు. ఇలాంటి వాటిపై ఇక నుంచి ఉక్కు పాదం మోపనున్నారు. పరీక్షల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారికి, చూచిరాతలకు సహకరించే పరీక్ష సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలను కట్టుదిట్టంగా అమలు చేయటానికి ఈ చట్టాన్ని ఉపయోగించనున్నట్లు  తెలిపారు. పరీక్ష నియమాల ఉల్లంఘన జరిగినా, జరపటానికి ప్రయత్నం చేసినా ఐపీసీ సెక్షన్లను అనుసరించి 3 నుంచి డేళ్ల జైలు శిక్ష విధిస్తారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని  ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని కోరారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా ప్రత్యేక బృందాలు నియమించామన్నారు. మాస్‌కాపీయింగ్‌ లాంటివి జరిగేతే చీఫ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.  పరీక్షలు జరిగిన తీరుపై రోజూ సవిూక్షించి తగిన చర్యలు చేపడుతామన్నారు. ఇదిలావుంటే పరీక్షలు జరిగేటప్పుడు మారుమూల గ్రామాల్లోని కేంద్రాలకు బస్సులు నడపాలని కలెక్టర్‌ సూచించారు. ఆర్టీసీ అధికారులు తాంసి, నార్నూర్‌ మండలాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది సైతం అందుబాటులో ఉంటారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకున్నట్లు  తెలిపారు. పరీక్ష రోజూ ఉదయం 9.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి ఇస్తారు. విద్యార్థులకు 15 నిమిషాలు ప్రశ్న పత్రాన్ని చదివే సమయం ఉండడంతో వారు క్షుణ్ణంగా చదివి, ప్రశ్నను ఆర్థం చేసుకుని ఎలాంటి ఆందోళన చెందకుండా జవాబులు రాయాలన్నారు.