పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

రంగారెడ్డి జిల్లా జనంసాక్షి :

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం, భూమిపూజ చేసిన మంత్రి హరీశ్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ….ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు మంచి పనులు చేశారు. ఇబ్రహీంపట్నం పై తనకు ప్రత్యేక ప్రేమ. అందుకే అభివ్రుది చేశారు.9 ఏళ్లలో సీఎం కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తున్నారు.

తల్లులు బలంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభించాం.నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30 శాతం అయితే, నేడు 72.8 శాతం.బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్స్, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్స్ ఇస్తున్నాం.మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారు అరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభించారు.రాష్ట్రంలో 200 క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రతి మంగళవారం మహిళల కోసమే పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తున్నారు.

తల్లికి పాలు కోడి గుడ్డుతో భోజనం పెట్టే అరోగ్య లక్ష్మి, ఉచితంగా గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్ళే అమ్మ ఒడి వాహనాలు ప్రారంభించాం.మహిళలకు తాగు నీటి కష్టాలు లేకుండా చేశారు సీఎం కేసీఆర్, నాడు నీళ్ళ కోసం కొట్లాట. కనీళ్ళ తండ్లాట

వడ్డీలేని రుణాలు, అభయహస్తం, బ్యాంకు లింకేజి పెంచాంవీఏవో లను నాటి ప్రభుత్వాలు గుర్తించలేదు. రెన్యువల్ ఆటోమేటిక్ చేయాలని, ఇన్సూరెన్స్ చేయాలని, వేతనం పెంచాలనే కోరికలను వారంలో పరిష్కరిస్తా.వీరితో పాటు ఆర్పీ ల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని ఆదేశించారు. వారంలో ఉత్తర్వులు ఇస్తాం.రుణమాఫీ కోసం ఒకేసారి 20 వేల కోట్ల రూపాయలు దాకా అప్పు మాఫీ చేసే కార్యక్రమం జరుగుతున్నది.ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా మంజూరు చేస్తాం.ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్నాయి సీఎం కేసీఆర్.ఆ చెక్కులు కూడా తల్లికి ఇవ్వాలని ఆదేశించారు.గృహలక్ష్మి ద్వారా ఇచ్చే డబ్బులు కూడా ఇంటి యజమానురాలు పేరు మీద ఇవ్వాలని ఆదేశించారు.ఏ కార్యక్రమం చేసినా మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు సీఎం కేసీఆర్మహిళలకు రూపాయి ఇస్తే, ఇంటికి సద్వినియోగం చేస్తారని సీఎం గారికి మీపై నమ్మకంనాడు 200 ఉన్న పింఛను ఉంటే 2000 చేసింది కేసీఆర్  కళ్యాణ లక్ష్మి 75 వేల నుండి లక్ష చేశారు. రైతు రుణ మాఫీ అన్నారు, చేసి చూపారు.కొందరు ఎన్నికలు రాగానే అన్ని ఇస్తాం అంటారు.ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ప్రతిపక్షాలు చేస్తయి.కాంగ్రెస్ వాళ్లు కర్ణాటకలో గెలిచారు. అక్కడ రైతులకు 8 గంటల కరెంట్ రావడం లేదు. బెంగళూర్ లో నాలుగు గంటలే ఇస్తున్నరు, పరిశ్రమలకు కరెంటు కోత ఉంది.కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంట్ పరిస్థితి అలా ఉంటే, ఇక్కడి కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు.మూడు గంటలు ఇస్తే, మూడు ఎకరాలు పారుతాయి అంటున్నడు రేవంత్ రెడ్డిబిజెపి వాళ్లు మీటర్లు పెట్టాలి అంటున్నారు, కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంట్ చాలు అంటున్నాడు, కేసీఆర్ మాత్రం మూడు పంటలు పండియ్యాలి అంటున్నడు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించాలి.రైతుల పాలిట నల్ల చట్టాలు తెచ్చి బిజెపి వాళ్లు పాపంగా మారితే, మూడు గంటల కరెంటు చాలు అంటూ కాంగ్రెస్ వాళ్లు శాపంగా మారారు.దీపం లాంటి కెసిఆర్ ఉండగా, పాపం లాంటి బిజెపి, శాపం లాంటి కాంగ్రెస్ ఎందుకు