పాటకు జేజేలు

సాహిత్య పఠిమకు జెజెలు …
— అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న పాలమూరు జిల్లా కవులు
మహబూబ్ నగర్ అర్ సి ,నవంబరు 21 (జనంసాక్షి ):
తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ -2022 పాటకు జేజేలు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాలమూరు జిల్లాకు చెందిన పాల్గొని పలు సాహిత్యాలకు సంబండించిన పత్రాలను సమర్పించారు . కవులు బోల యాదయ్య (వెన్నెల కంటి – జీవితం – సినీగీతాల సాహిత్యం), విఠలాపురం పుష్పలత ( గూడ అంజయ్య -జీవితం -సినీగీతాల సాహిత్యం),  పొన్నగంటి ప్రభాకర్ (భాస్కరభట్ల- జీవితం – సినీగీతాల సాహిత్యం), జీవనజ్యోతి ( వనమాలి సినీగీతాల సాహిత్యం) లు పత్రసమర్పణ చేశారు.  ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీగేయరచయిత మౌనశ్రీ మలిక్ పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్దన్, రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి, కట్టుకోఝ్వల రమేష్ మరియు నిర్వహకులు సినీగీతరచయిత తిరునగరి శరత్ చంద్ర ,అనంతోజు మోహనకృష్ణ   పత్రసమర్పకులు కవులు గాయకులు తదితరులు పాల్గొన్నారు.