పాఠశాలలను పర్యవేక్షించిన  జిల్లా విద్యాశాఖ అధికారి

…పాఠశాలలను పర్యవేక్షించిన  జిల్లా విద్యాశాఖ అధికారి…
ధర్మపురి( జనం సాక్షి) మండలంలోని దోనూర్, జైన గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి డా. బొల్లం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పర్యవేక్షించారు.ఆయా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు మనబడి ప్రాజెక్టు కింద జరుగుతున్న పనులను పర్యవేక్షించి పనులను వేగవంతం చేయాలని, కాంట్రాక్టర్లకు సూచించారు. అదేవిధంగా జైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను  పర్యవేక్షించి అక్కడ జరుగుతున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులకు తగు సూచనలు ఇస్తూ, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందివ్వాలని సూచించారు. అదేవిధంగా మన ఊరు – మనబడి స్కీం కింద  ఎంపికైన మోడల్ పాఠశాలలే కాకుండా మిగతా అన్ని పాఠశాలలో కూడా పనులు వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల విద్యాధికారి బత్తుల భూమయ్య, ఏఈ భోగ సతీష్, ప్రధానోపాధ్యాయులు కాశెట్టి రమేష్ ,గడిపెల్లి అనూష,బక్కశెట్టి రవీందర్,భాస్కర్ తదితరులు ఉన్నారు