పాతబసస్తీలో పరిస్థితిప్రశాంతం

 

 

హైదరాబాద్‌: నవంబర్‌ 12, (జనంసాక్షి):

రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీలో ప్రస్తుతం పరిస్తితి తమ అదుపులోనే ఉందని, పాతబస్తీ అంతా ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంచనీయ సంఘటనులు ఇప్పటి వరకు నమోదు కాలేదని డీసీపీ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేటు చేసుకోలేదని పాతబస్తీ మొత్తం ప్రశాంతంగా ఉందని రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే 144 సెక్షన్‌ను సడలిస్తామని ఆయన తెలిపారు.