పారిశ్రామిక సంఘాలతో నేడు సీపీడీసీఎల్‌ భేటీ

హైదరాబాద్‌: పారిశ్రమిక రంగానికి విద్యుత్‌ కోతలను  అధిగమించే విషయమై విద్యుత్‌ పంపిణీ సంస్థ సీపీడీసీఎల్‌ నేడు పారిశ్రామిక సంఘాలతో కానుంది. గతంలో ఎన్నడూలేని విధంగా వర్షాకాలంలో  ఎక్కువ విద్యుత్‌ కోతలు విధంచడంపై పారిశ్రామిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన విద్యుత్‌ పంపీణీ సంస్థలు పారిశ్రామిక సంఘాలతో చార్చలు జరపాలని నిర్ణయించాయి. ఈరోజు జరిగే భేటీకి హాజరుకావాలని చిన్నతరహా పారిశ్రామిక సంఘాల రాష్ట్ర సమాఖ్య ప్రతినిధులను ఆహ్వానించారు.