పింఛన్ ఐడి కార్డులు పంపిణీ చేసిన 19వ వార్డు కౌన్సిలర్ షేక్షావలి ఆచారి

అయిజ, సెప్టెంబర్ 27 (జనం సాక్షి):


జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో 19వ వార్డ్ కౌన్సిలర్ అయినటువంటి మాస్టర్ షేక్షావలి ఆచారి ఆధ్వర్యంలో పింఛన్లు ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాట్లాడుతూ ఐడి కార్డుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆల్రెడీ పింఛన్లు వస్తున్న వారికి ఇవి ఇవి కేవలం గుర్తింపు కోసం అని ఐడి కార్డుల విషయంలో ప్రజలు ఆందోళనకు గురికావొదని పేర్కొన్నారు అంతేకాకుండా 2020 నుండి అప్లై చేసుకున్న కొత్త పింఛన్దారులు ఎదురుచూస్తున్నారని వీరికి ముందుగా పింఛన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ రమేష్ , కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు ఎన్ సాంబశివుడు, మునిసిపాలిటీ సిబ్బంది అడివన్న మరియు వార్డు సభ్యులు మొదలగు వారు పాల్గొన్నారు.