పీసీసీ పేరిట వెబ్‌సైట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ పేరిట రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు కృష్ణమూర్తి ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. వెబ్‌సైట్‌ ద్వారా ఏఐసీసీ అధ్యక్ష, ఉపాధ్యక్షులైన సోనియా, రాహుల్‌ గాంధీల ప్రసంగాలను కార్యకర్తలను వినిపించారు.