పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్ ను కలిసిన కార్పొరేటర్లు

నాచారం(జనంసాక్షి) : నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ , మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఉప్పల్ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి తో కలిసి మున్సిపల్ శాఖ మాత్యులు టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ ప్రభుదాస్, టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , సాయి జన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.