పురావాస్తు కట్టడాలను సంరక్షించాలి

గద్వాల ఆర్ సి. (జనం సాక్షి) ఆగస్ట్ 12 .గద్వాలలోని నల సోమభూపాలుడు(నలసోమనాద్రి) పరిపాలించిన కోట మరియు మహారాజు కట్టించిన కట్టడాలను సంరక్షించి భావి తరాలకు వారి యొక్క వైభవాన్ని చాటి చెప్పాలనీ ఈ నేపథ్యంలో గద్వాల కోటలోని శిథిలావస్థ స్థితిలో వున్న సీతారాం భూపాల్ కూర్చున్న విగ్రహం పూర్వ పరిస్థితి చేయాలని పురావస్తు సమితి కోరగా అందుకు సంఘాల అయ్యప్ప రెడ్డి ముందుకు వచ్చి దాదాపు (రెండున్నర లక్షలు) తో రాజా సీతారాం భూపాల్ గారి విగ్రహనికి మళ్లీ గత వైభవం తీసుకు వచ్చారు.వారికి మా పురావస్తు కట్టడాల పరిరక్షణ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాతో సత్కరించి ఇదేవిధంగా పురాతన కట్టడాలను మరమ్మతులు వేసి భావి తరాలను అందించుటకు ముందుకు రావాలని గద్వాల పుర ప్రజలను పెద్దలను ఆహ్వానిస్తున్నామని పురావాస్తు కట్టడాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు శ్రీ కే మోహన్ రావు బాల గోపాల్ రెడ్డి భీంసేన్ రావు రామలింగేశ్వర కామ్లే అల్యుమినియమ్ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి కేశవ రెడ్డి శివా రెడ్డి ఆలూరు ప్రకాష్ గౌడ్ ప్రభాకర్ విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు సయ్యద్ నూరుద్దీన్ మధు సూదన్ బాబు బుచ్చన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.