పులికాట్‌ సరస్సులో పడిన బస్సు.. 20 మందికి గాయాలు

అమరావతి,నవంబర్‌ 8 (జనం సాక్షి) : అదుపు తప్పి ఆర్టీసి బస్సు పులికాట్‌ సరస్సులో బోల్తా పడిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు 80 మంది ప్రయాణికులతో వెళ్తుండగా సూళ్లూరుపేట నుంచి కొరిడి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం.