పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

 కల్వకుర్తి సెప్టెంబరు 20 జనం సాక్షి:
కల్వకుర్తి పట్టణంలోని జెపి నగర్ పాఠశాల లో 2003-2008 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 14 సంవత్సరాల తరువాత కలుసుకొని తమ ఆనందాన్ని ఒకరినొకరు పంచుకుంటూ పలకరించుకుంకొని తమ బాగోగులు తెలుసుకున్నారు. వారికి విద్యాభ్యాసం చేసిన ఉపాద్యాయులు కూడా రావడం తో విద్యార్థులు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు ఆనందంగా పలకరించుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు పండుగ వాతావరణంలో పోయిన జ్ఞాపకాలను గతాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెట్టారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యత వహించిన గోపి, రాజు, భారత్, కిరణ్ ,మారి లకు మిగత విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింగారెడ్డి,రహిమ్, గిరిధర్, ఉషారాణి, అన్నపూర్ణ,భాగ్యలత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area