పూస నర్సయ్య సేవలు మరువలేనిది

భీంగల్(జనంసాక్షి):గంగపుత్ర చైతన్య సమితి వ్యవస్థాపకుడు పూస నర్సయ్య యాబై తొమ్మిదవా వర్ధంతి సందర్భంగా రామన్నపేట గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘము భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు.గంగపుత్ర సంఘము జిల్లా అధ్యక్షుడు పల్లికొండ నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పూస నర్సయ్య గంగపుత్ర జాతికి చేసిన సేవలు మరువలేనిది అని,జాతి మనుగడకు ఆయన చాలా కృషి చేసారని అన్నారు.ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు ఎర్ర ఆశన్న,భీంగల్ మండల ఉపాధ్యక్షుడు బెస్త గంగారాం తదితరులు పాల్గొన్నారు.