పెన్షన్స్ గుర్తింపు కార్డులు పంపిణీ

టేకులపల్లి ,సెప్టెంబర్ 3( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను మండల వ్యాప్తంగా 1507 కొత్త గుర్తింపు కార్డులను శుక్రవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.
అన్ని గ్రామపంచాయతీలలో మిగిలిన కార్డులను ఆయా గ్రామపంచాయతీలలో శనివారం సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు చేతుల మీదుగా అందజేస్తున్నారు . ఈ క్రమంలో ముత్యాలపాడు క్రాస్ రోడ్ గ్రామపంచాయతీ నందు ఆసరా పింఛన్లు సర్పంచ్ మాలోతు సురేందర్ నాయక్ ,పంచాయతీ కార్యదర్శి శ్వేత, వార్డు సభ్యులు కలిసి లబ్ధిదారులకు పింఛను గుర్తింపు కార్డులను అందజేశారు.