పెళ్లి ఇంట్లో చోరీ

హైదరాబాద్‌ : మౌలాలీలోని గోపాల్‌నగర్‌లో ఓ పెళ్లి ఇంట్లో చోరీ జరిగింది. 12 తులాల బంగారం, రూ. 1.50 లక్షల నగదు, పెళ్లి బట్టలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.