పేదరైతులకు అండగా నిలవాలి

విశాఖపట్టణం,నవంబర్‌21 (జనం సాక్షి)  : రైతులకు వ్యవసాయం లాభ సాటిగా ఉండాలని చెప్పడం మంచిదే అయినప్పటికీ వాణిజ్య పంటలవైపు మళ్లించాలనడం చూస్తే పేదల చేతుల్లో భూములు లాక్కొనే ప్రణాళిక ఉందన్నది స్పష్టంగా విదితమౌతోందని సిపిఎం విశాఖ నగర కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు అన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూమి కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నాలు జరికాదన్నారు. సన్న, చిన్న కారు రైతులకు లాభసాటిగా మారే వ్యవసాయ నమూనాపై చర్చ జరగాలన్నారు.