*పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్**పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని బేగం గార్డెన్ లో శంషాబాద్ మున్సిపాలిటీ & మండలానికి చెందిన 107 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులు అప్పుల పాలు అయ్యేవారని ముఖ్యమంత్రి కేసీఆర్ వారి బాధలు చూడలేక ఆడబిడ్డల పెండ్లి కొరకు లక్ష నూట పదహారు వేల రూపాయలు ఇచ్చి వారికి భరోసా ఇస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గాయి అన్నారు. ఇలాంటి మంచి పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మంచి మనస్సుతో ఆశీర్వదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్, ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్, కమిషనర్ సాబేర్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ నరేష్, ఆర్ఐలు సంజీచ,సునీతా,కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.