పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ధర్మపురి పోలీస్.

పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించిన ధర్మపురి పోలీస్

ధర్మపురి ( జనం సాక్షి)ప్రజా సమస్య పరిరక్ష న్నే దేయంగా సమాజ శ్రేయస్ కొరకు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ధర్మపురి పట్టణ కేంద్రంలోని సర్కిల్ పోలీస్ సమక్షంలో ఏర్పాటు చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శనివారం ఉదయం సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి సబ్ ఇన్స్పెక్టర్ దత్తాద్రి, బుగ్గారం, గొల్లపల్లి, వెలగటూరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది పాల్గొని అమరులను స్పారించుకుంటూ, ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి,సబ్ ఇన్స్పెక్టర్ దత్తాద్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సైన్యం సంగీ సతేమ్మ ,ఎఎంసి చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, కౌన్సిలర్లు తరాల కార్తీక్, అయ్యోరి వేణుగోపాల్, యూనిస్, ప్రజా కుల సంఘాల నాయకులు ఆటో యూనియన్ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు