పోలీస్ కవి “పోది”లో మరో “ఒక కొమ్మకు పూసిన” పుస్తకం ఆవిష్కరణ

పోలీస్ కవి “పోది”లో మరో “ఒక కొమ్మకు పూసిన” పుస్తకం ఆవిష్కరణ

ముప్కాల్ (జనం సాక్షి) అక్టోబర్ 16 ధార్మిక సాహిత్య వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం “దొడ్డి కొమురయ్య” హాల్ హైదరాబాద్ నందు జరిగిన కార్యక్రమంలో ముప్కాల్ పోలీస్ కవి ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన ,”ఒక కొమ్మకు పూసిన పుస్తకాన్ని” కళా రత్న సిని గేయ రచయిత బిక్కీ కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ సమాజంలోని అంశాలను పుస్తకాల ద్వారా ప్రజలకు అందజేయడం రచయితల ఉద్దేశ్యమని అవి సమాజానికి దోహదం చేసేట్లుగా ఉండాలని కోరుకుంటారు అలాంటి మంచి పుస్తకాన్ని రచించిన కవి తొగర్ల సురేష్ ను అభినందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ పూర్వ రిజిస్టర్ గౌరీ శంకర్ కవి విమర్శకులు నాలేశ్వర శంకర్ మరియు ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత వెంకటస్వామి నాయుడు, కవి గిడుగు క్రాంతి కృష్ణ, మరియు మోటారి నారాయణ, ప్రముఖ జర్నలిస్ట్ మరియు దామోదరాచారి, డాక్టర్ ఆలపాటి ,మహమ్మద్ ఉస్మాన్ ఖాన్ జర్నలిస్ట్ వంటి గొప్ప కవులు మరియు జర్నలిస్టులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కాజా ముసిఫ్ఒద్దిన్ మరియు మహమ్మద్ అబ్దుల్ రషీద్ చేతుల మీదుగా నిర్వహించారు