ప్యాకేజీ ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ లాంటిది
– మోదీ హామీలకు విశ్వాసం లేదు
– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్
న్యూఢిల్లీ,ఆగస్ట్ 18 (జనంసాక్షి):
బీహార్కు ఆర్థిక ప్యాకేజీ ఓ ఎన్నికల స్టంటని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హావిూని కూడా ప్రధాని నెరవేర్చడంలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ లాంటిదని రాహుల్ ఎద్దవ చేశారు. గతంలో ఇచ్చిన ఒక్క హావిూని కూడా నిలబెట్టుకోవడంలేదని మండిపడ్డారు. ఆయనకు హావిూలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయడం తెలియదన్నారు. బీహార్కు ఇవాళ ప్రధాని మోదీ ప్రకటించిన స్పెషల్ ఆర్థిక ప్యాకేజీ ఎన్నికల స్టంట్గా రాహుల్ అభివర్ణించారు. మోదీ మాటలను ఎవరూ విశ్వసించవద్దని కోరారు. కాగా, ఇవాళ బీహార్ లో ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీ బీహార్ కు రూ.లక్షా 25 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదంతా ఎన్ఇనకల కోసం ఆడుతున్న నాటకమన్నారు.