ప్రజల ఆకాంక్షల మేరకే బిఎల్‌ఎఫ్‌ ఏర్పాటు

ఖమ్మం,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేశామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నగరంలోని సుందరయ్య భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్‌, తెదేపా, తెరాసలతో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయంతోనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతాయని చెప్పారు. అందుకే తాము బడుగు బలహీనవర్గాలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌. నాగేశ్వరరావు పాల్గొన్నారు.