ప్రజల విశ్వాసం నిలుపుకుంటాం

5

– హామీలు నెరవేరుస్తాం

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి9(జనంసాక్షి): గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మంకార్పొరేషన్‌, అచ్చంపేట నగర పంచాయతీలో గెలుపు అందించిన ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ఓటర్లు దీవించారన్నారు. పార్టీ విజయం కోసం శ్రమించిన అందరికీ అభినందనలు తెలిపారు. వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేరుస్తామన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపుతామని అన్నారు. అభివృద్ది ఎజెండాగా ముందుకు సాగుతామని అన్నారు. విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం పట్ల నాయకులకు సీఎం అభినందనలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని ఓటర్లు దీవించారని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శ్రమించిన అందరికీ అభినందనలు తెలిపారు. వరంగల్‌, ఖమ్మం, అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హావిూలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు