ప్రజా సంక్షేమం అభివృద్ధిని కోరుకున్న మునుగోడు ప్రజలు కొండమల్లేపల్లి ఉపసర్పంచ్ గంధం సురేష్

 కొండమల్లేపల్లి నవంబర్ 7 జనం సాక్షి న్యూస్: సోమవారం నాడు మండల కేంద్రంలో కొండమల్లేపల్లి ఉప సర్పంచ్ గంధం సురేష్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి మునుగోడు ప్రజలు ఓటు వేశారని నీతికి నిజాయితీకి పట్టం కట్టారని మునుగోడు నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ప్రజా నాయకుడిని ప్రజలు గెలిపించారని మునుగోడు లో భారీ మెజార్టీతో గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ భారీ విజయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు నాంది పలికారని మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయం కెసిఆర్ నాయకత్వంలో దేశానికి కొత్త దశ దిశ అందిస్తుందని మునుగోడు ఉప ఎన్నిక విజయం ద్వారా ప్రజలు సందేశం ఇచ్చారని పేర్కొన్నారు సీఎం కేసీఆర్ నాయకత్వానికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని దీనికి ఉదాహరణగా మునుగోడు విజయం మరో నిదర్శనం అన్నారు అధికారం డబ్బు ప్రలోభాల కంటే ప్రజాస్వామ్యం గొప్పదని మునుగోడు ప్రజలు చాటి చెప్పారని తెలంగాణకు కావలసింది విద్వేషం విషం కాదని అభివృద్ధి సంక్షేమమేనని మునుగోడు ప్రజలు స్పష్టం చేశారని చెప్పారు మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయానికి సైనికుల్లా పని చేసిన టిఆర్ఎస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు మునుగోడులో టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన సిపిఐ సిపిఎం పార్టీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటే రాష్ట్ర ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు మునుగోడు గెలుపుతో టిఆర్ఎస్ దేశ రాజకీయాల్లో విజయ యాత్ర ప్రారంభించిందని బిజెపి పతనం మొదలైందని తెలిపారు రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ మరింత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సాధిస్తుందని తెలిపారు మునుగోడు లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు