ప్రతి ఒక్కరు మరుగుదొడ్డి వాడాలి

ప్రతి వ్యక్తి మరుగుదొడ్లను వాడుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్లు పేర్కొన్నారు.ప్రపంచ స్వచ్ఛత దినోత్సవన్నీ పురస్కరించుకొని శనివారం దోమ మండల కేంద్రంలో విద్యార్థులు గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా మరిగుదొడ్లు లేని వారు నిర్మించుకుంటే పంచాయతీ నుండి 12 వేల రూపాయలు ఇస్తామని సర్పంచ్ తెలిపారు అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రతిజ్ఞ చేసారు