ప్రతేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.

కడప : రాష్ట్రం విడిపొవాల్సి వస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుచేయాలని తెలుగుదేశం నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్‌ చేశారు. కడపలో అయన విలేకరులతో మాట్లాడుతూ ఉజ్వల చరిత్ర కలిగిన రాయలసీమను కొందరు వ్యక్తులు స్వార్థం కోసం విడగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా తమ ఉద్యమం కొనసాగుతుందని అయన స్పష్టం చేశారు.