ప్రత్యేక హోదా, నిధులపై ఎంపిల చర్చ

న్యూఢిల్లీ,మే4(జ‌నంసాక్షి): ప్రత్యేక  హోదా, కేంద్ర నిధులు, రాస్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తదితర అంశాలపై తెలుగుదేశంపార్లమెంట్‌ సభ్యులు చర్చించారు. మంత్రి  సుజనాచౌదరి నివాసంలో టీడీపీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపిలు పలు అంశాలపై చర్చించారు. ఏపీకి మరిన్ని నిధులు, ¬దాపై సమావేశంలో చర్చించామని కేంద్ర మంత్రి సుజనాచౌదరి చెప్పారు. ఇప్పటికే కేంద్రం కొంతమేర సాయం చేసిందని, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో మరింత సాయం చేయాలని సుజనాచౌదరి కోరారు. ప్రత్యేక ¬దాపై తాము ఆశలు వదులుకోలేదని సుజనాచౌదరి వివరించారు. ఇటీవల కేంద్రమంత్రి రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల దరిమిలా ఉత్పన్నమైన పరిస్తితులు చర్చించారని సమాచారం. లోక్‌సభలో ప్రత్యేక ¬దా కోసం పోరాడుతూనే నిధుల కోసం పోరాడాలని నిర్ణయించారు.