ప్రధాని ఆహ్వానిస్తే మంత్రివర్గంలో చేరతాం

4
..నిజామాబాద్‌ ఎంపీ కవిత
కరీంనగర్‌,మే18(జనంసాక్షి): ప్రధాని ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరతామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. కరీంనగర్‌  జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కవిత హాజరయ్యారు. ఇప్పటివరకు రూ.470 కోట్ల అభివృద్ధి పనులు చేసినమని ఎంపీ కవిత అన్నారు. ఈ మేరకు ఆమె అభివృద్ది కార్యక్రమాలపై సవిూక్ష చేశారు. అనంతరం ఆమె విూడియాతో మాట్లాడుతూ రైతులపై అన్ని పార్టీలు కపట ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు. రైతు సమస్యలపై అనవసర రాద్దాంతం చేస్తూ పాదయాత్రలు చేస్తున్నరని విమర్శించారు. రానున్న నాలుగేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధిస్తామని..అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు బిత్తరపోక తప్పదని హెచ్చరించారు. రైతులకు ఏవిూ చేయని పార్టీలు ఇవాళ మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. ఇంతకాలం అధికారంలో ఉన్నవారు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. రాహుల్‌ పర్యటనతో టిఆర్‌ఎస్‌ వణుకుతోందని ప్రకటనలు చేస్తున్న వారు ఇంతకాలం ఏం చేశారో ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు చెప్పాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.