ప్రధాని పదవి, పెళ్లి… అవి రెండూ అసందర్భ ప్రశ్నలు: రాహుల్‌

ఢిల్లీ, జనంసాక్షి: తన గురించి, ప్రధాని పదవి చేపట్టడం గురించి పాత్రికేయులు తరచూ తనని ప్రశ్నింస్తుంటారని, ఏమీ చెప్పకపోయిన రకరకాల వూహాగానాలు రాస్తుంటారని రాహుల్‌గాంధీ అన్నారు. సీఐఐ సదస్సులో మాట్లాడుతూ ఆయన అవి రెండూ కూడా అసంర్భ అంశాలన్నారు. ప్రస్తుతం మన ముందున్న సందర్భోచిత ప్రశ్న ఒక్కటేనన్నారు. మన ప్రజలకు వారి అవసరాలు తెలియజేయగల గొంతునివ్వడమెలా అన్నదే తాను ఆలోచిస్తున్న అంశమని రాహుల్‌ పేర్కొన్నారు.