ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవ సందర్భంగా స్వచ్ఛత రన్

స్వచ్ఛత రన్ స్వచ్ఛత కోసం పరుగు కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ కుసుమ వెంకటమ్మ శ్రీనివాసరెడ్డి
 గరిడేపల్లి, నవంబర్ 19 (జనం సాక్షి): మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా స్వచ్ఛత రన్ స్వచ్ఛత కోసం పరుగు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుసుమ వెంకటమ్మ శ్రీనివాసరెడ్డి పాల్గొని ఈ సందర్భంగా సర్పంచ్ కుసుమ వెంకటమ్మ శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ గాంధీ కోరిన గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అందులో భాగంగా స్వచ్ఛత రన్ నిర్వహించి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆరుబయట మలవిసర్జన ఆడపడుచులకు అవమానకరమని మహిళల ఆత్మగౌరవం కాపాడుకోవాలని అందుకు ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని అదేవిధంగా భూగర్భజలాలు తరిగిపోతున్నందున ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామపంచాయతీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు సహకరించి గ్రామాన్ని సంపూర్ణ స్వచ్ఛ గ్రామంగా మార్చుకోవడానికి ప్రజలంతా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి , వార్డ్ మెంబర్స్, ఫీల్డ్ అసిస్టెంట్ ,పాఠశాల ఉపాధ్యాయులు , గ్రామ ప్రజలు  పాల్గొన్నారు.