ప్రభుత్వ బోరు.. సొంత చేనుకు నీరు’ కథనంపై వీర్ శెట్టి వివరణ

ప్రభుత్వ బోరు.. సొంత చేనుకు నీరు’ కథనంపై వీర్ శెట్టి వివరణ

మునిపల్లి, అక్టోబర్ 16, (జనంసాక్షి): ‘ప్రభుత్వ నిధులు.. సొంత చేనుకు నీరు’ పేరుతో జనంసాక్షిలో ప్రచురితం అయినా కథనంపై బుసారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ కుమారుడు వీర్ శెట్టి వివరణ ఇచ్చారు. ఆ నీటి బోరు తమ సొంత పొలంలోనే ఉన్నట్లు తెలిపారు. పశువులకు నీళ్లు తాగడానికి ఇబ్బందిగా ఉండటంతో సర్పంచ్ గా పని చేసిన వాళ్ళ నాన్న ప్రసాద్ వీరప్ప సొంత డబ్బులతో నీటి తొట్టిని కట్టించినట్లు చెప్పారు. ఇప్పుడు అందరికి నీటి సౌకర్యం ఉండటంతో ఆ తొట్టిని ఉపయోగించట్లేదని తెలిపారు. తనపై కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు.