ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

గత శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారనే సంగతి విధితమే. అయితే శనివారం మునగాల మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ  నాయకులు శెట్టి గిరి చనిపోయిన కుటుంబాలకు కుటుంబానికి 25 కేజీల చొప్పున బియ్యం, ఆర్థిక సహాయాన్ని చేశారు. ఈ సందర్భంగా శెట్టి గిరి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుచున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న భక్తులు ఈ విధంగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. అయితే మృతి చెందిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన తీసుకున్న మంచి నిర్ణయానికి టిఆర్ఎస్ పార్టీ మండల నాయకత్వం, పలువురు ఘనంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు నల్లపాటీ శ్రీనివాసరావు, నల్లపాటి నాగేశ్వరావు, సైకిల్ షాప్ నాగిరెడ్డి, మునగాల మండల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బెజవాడ గోవర్ధన్, దేవినేని నాగేశ్వరావు, అక్కనిపల్లి రవి, బొబ్బిలి శ్రీనివాసరెడ్డి, అలీ, పాపారావు తదితరులు పాల్గొన్నారు.