ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి మండలాల ప్రత్యేక అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు.
 కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ అధికారులతో మాట్లాడారు.
వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు.
వివిధ సమస్యలపై 26 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
 అర్జీలను పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండలాల ప్రత్యేక అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ నరసింగరావు, సిపిఓ భూపాల్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, తదితరులు ఉన్నారు.