ఫోటో, వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

 

 

 

 

 

 

పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 03 (జనం సాక్షి): మణుగూరు మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో గణపతి 5 వ త్రిరాత్రోత్సవం సందర్భంగా శనివారం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులు పాటు గణనాధునికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ఉదయం లడ్డు, కలశం పాట నిర్వహించి మణుగూరు పట్టణ వీధులలో వినాయకున్నీ ఉరేగించి , ఆట పాటలతో సంబరంగా. కనుల పండుగగా వినాయకుని నిమజ్జనం చేశారు. జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ పట్టణ వీధుల్లో మారుమ్రోగింది.. అలాగే ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలకు సహకరిస్తున్న దాతలకు అసోసియేషన్ తరపున పట్టణ అధ్యక్షులు కృష్ణ మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.. ఈ నిమజ్జనం కార్యక్రమం కుల మతాలకు అతీతంగా మణుగూరు మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాస్వత సభ్యులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.