బస్సు, వ్యాను ఢీ: 20 మందికి గాయాలు

కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, పాలవ్యాను ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా, డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.