బాంబుదాడితో ఉలిక్కిపడ్డ ఆసిస్‌ క్రీడాకారులు

తొలిరోజే బాంబుదాడి స్వాగతంతో ఆందోళన
ఇస్లామబాద్‌,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): 24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆస్టేల్రియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. పెషావర్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మంది గాయపడినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారమే పెషావర్‌కు 187 కివిూ దూరంలో ఉన్న రావల్పిండి వేదికగా ఆస్టేల్రియా, పాకిస్తాన్‌ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. దీంతో ఆస్టేల్రియా ఆటగాళ్లలో కంగారు మొదలైంది. ఉగ్రవాదుల దాడుల భయంతో పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ఏ జట్టు ఇష్టపడలేదు. దీనికి తోడూ 2009లో పాక్‌ పర్యటనకు వచ్చిన లంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. ఈ దాడిలో లంక క్రికెటర్లు సమరవీర, జయవర్దనే, సంగక్కర సహా తదితర క్రికెటర్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తాన్‌ పోలీసులతో పాటు ఇద్దరు దేశ పౌరులు కాల్పులకు బలయ్యారు. దీంతో పాక్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు నిరాకరించాయి. అయితే ఇటీవలే మా దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేశాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ సహా పీసీబీ స్వయంగా వెల్లడిరచింది. కాగా తమ దేశంలో సిరీస్‌ ఆడేందుకు రావాలని క్రికెట్‌ ఆస్టేల్రియాను కోరింది. ఆ దేశం కోరికను మన్నించి ఇక్కడకు వచ్చింది. తాజాగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టి20 మ్యాచ్‌ ఆడడానికి ఆస్టేల్రియా పాకిస్తాన్‌పై మరోసారి అడుగుపెట్టింది. పెషావర్‌ బాంబు దాడి నేపథ్యంలో క్రికెట్‌ ఆస్టేల్రియా (సీఏ) ఒక్కసారిగా ఉలిక్కిపడిరది. ఘటన జరిగిన ప్రాంతం రావల్పిండికి ఏమంత దూరం కాకపోవడంతో సీఏ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అయితే పాక్‌ లో ఉన్న తమ ఆటగాళ్ల భద్రత గురించి ఆసీస్‌ ఎప్పటికప్పుడూ ఆరా తీస్తున్నది. భద్రతకు సంబంధించి ఏ ఆటగాడికి ఇబ్బంది కలిగినా తిరిగి స్వదేశానికి రావొచ్చని సీఏ సూచించినట్టు సమాచారం. శుక్రవారం కావడంతో ప్రార్థనలకు వెళ్లిన చాలా మంది అమాయకులు బాంబుదాడిలో మరణించారు. అయితే సాయుధులై ఉన్న తీవ్రవాదులు.. ముందు ప్రజలపై కాల్పులు జరుపుదామని ప్రయత్నించినా.. అది వీలుకాకపోవడంతో ఆత్మాహుతికి దిగారని తెలుస్తున్నది. ఈ ఘటనను పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తో పాటు ప్రతిపక్ష నాయకుడు షాబాజ్‌ షరీఫ్‌ కూడా ఖండిరచారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించారు. గాయపడిన మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులన ఆస్పత్రులకు తరలించి తగిన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.