బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం

8మందికి గాయాలు
కాకినాడ,సెప్టెంబర్‌30 జనంసాక్షి  :   తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం జి.మేడపాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో జరిగిన ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.