బాధితుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీపీ,

ఖానాపురం ఆగష్టు 30జనం సాక్షి
 మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను అలాగే అనారోగ్యానికి గురైన కుటుంబాలను మండల అధ్యక్షుడు వెంకట నరసయ్య, సర్పంచ్ రమణ అశోక్   తో కలిసిపరామర్శించారు. కొత్తూరు గ్రామానికి చెందిన  బోడ య్యకు మాజీ సర్పంచ్, శాఖపురపు లక్ష్మయ్య, మద్దూర్ బాబు, నారెడ్ల కమలమ్మ, రాధారపు ఐలయ్య, కడారి ఐలయ్య, మంగ రవి, అబ్బర బోయిన లింగమ్మ వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.ఈ
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జేరిపోతుల వెంకటేశ్వర్లు, భాష బోయిన చంద్రయ్య, వార్డు మెంబర్లు పోతరాజు కుమార్, మండల పార్టీ నాయకులు సోదరులాల్, పట్టాపురం రాజు,  గ్రామ పార్టీ అధ్యక్షులు కోరే రాములు, నాంచారి కుమార్, బోడ చందు, బోడ ఈర్య తదితరులు పాల్గొన్నారు.