బాన్సువాడాలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం..

బాన్సువాడ, ఆగస్టు 19 (జనంసాక్షి):
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని శుక్రవారం పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో బాన్సువాడ ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో  ఫోటోగ్రఫీ సృష్టికర్త అయిన  లూయిస్  డాగ్యురే   చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  కేక్ కట్ చేసి ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడుతూ మారుతున్న కాలంలో టెక్నాలజీ బాగా పెరగడంతో ఫోటోగ్రాఫర్లకు ఆదరణ తగ్గినప్పటికీ, ఫోటోగ్రాఫర్ పై ఉన్న మక్కువతో యువత ఫోటోగ్రఫీపై ఆసక్తి కనబరచడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్ యాదవ్, కార్యదర్శి దత్తు , కోశాధికారి ప్రకాష్ తదితర ఫోటోగ్రాఫర్ లు పాల్గొన్నారు.