బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన కార్పొరేటర్

అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన
గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అన్నారు. దళితుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ భూదేవి నగర్ లోని బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్పొరేటర్ సూచించారు. సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు భాస్కరరావు, జనరల్ సెక్రటరీ అనంతుల సంతోష్, సయ్యద్ మోసిన్, ప్రభాకర్, ఈశ్వర్ గౌడ్, శ్యాంసుందర్, ప్రకాష్ గౌడ్, జనార్ధన్, షేక్, షరీఫ్, రామచందర్, రాజేష్, ముత్యాలు, మైవాన్, కుట్టి, షబీర్, సురేష్, రాజు, సమ్మయ్య, ఉదయ, స్వప్న, కల్పన, తదితరులు పాల్గొన్నారు.