బాలికపై అత్యాచారం ఘటనలో ఐదుగురి పాఠశాల సిబ్బంది సస్పెండ్
న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఐదుగురు పాఠశాల సిబ్బందిని ఎంసీడీ కమిషనర్ పీకే గుప్తా సస్పెండ్ చేశారు.సస్పెండ్కు గురైన వారిలో పాఠశాల ప్రిన్సిపాల్, పర్యవేక్షకుడు, ఉపాధ్యాయులు, అటెండర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతుందడటంతో పోలీసులు కేసు విచారణపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ సేకరించిన సమాచారంతో నిందితుని వూహా చిత్రాన్ని రూపోందించడంలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. అయితే పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు, సెక్యూరిటీ గార్డుతోపాటు పది మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాధితురాలైన రెండో తరగతి విద్యార్థినిని ఆసుపత్రి నుంచి నిన్న డిశ్చార్జి చేశారు.