బాల్క సుమన్ జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలి – న్యూ ఇండియా పార్టీ నాయకులు విక్రమ్ సింగ్ డిమాండ్

బాల్క సుమన్ జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాలి – న్యూ ఇండియా పార్టీ నాయకులు విక్రమ్ సింగ్ డిమాండ్

జనంసాక్షి, రామగిరి : జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క
సుమన్ వెంటనే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని న్యూ ఇండియా పార్టీ నాయకులు విక్రం సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మందమర్రి లో జరిగిన పార్టీ మీటింగ్ లో జర్నలిస్టులను ఉద్దేశించి వాడు, వీడూ అంటూ కించపర్చేలా
మాట్లాడారని మండిపడ్డారు. వంకర రాతలు రాయకుండా వారిని సక్కగ జేయడానికి ఏం చేయాలో అది చేయండి అంటూ పార్టీ కార్యకర్తలను జర్నలిస్టులపై దాడులకు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాల్క సుమన్ వెంటనే జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.