బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థి మృతి

మంత్రి సబిత ఇంటిముట్టడికిఎన్‌ఎస్‌యూఐ యత్నం

హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడిరచేందుకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు యత్నించారు. ఈనెల 15న బాసర ట్రిపుల్‌ ఐటీ లో ఫుడ్‌ పాయిజన్‌ అయిన విషయం తెలిసిందే. సుమారు ఆరువందల మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాగా… ఫుడ్‌ పాయిజన్‌ వల్ల పీయూసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సంజయ్‌ కిరణ్‌ తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఫుడ్‌ పాయిజన్‌ వల్ల విద్యార్థి మరణించినా ప్రభుత్వం కానీ, సంబంధిత శాఖ మంత్రి పట్టించుకోవడంలేదని ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం మంత్రి సబిత ఇంటిని ముట్టడిరచేందుకు నేతలు యత్నించగా… పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముట్టడికి వచ్చిన విద్యార్థులు, నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు