*బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి కాదు*…….
*బిఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీనివాస్*……ఫోటో రైట్ ప్…. సమావేశంలో మాట్లాడుతున్న బిఆర్ఎస్ నాయకులు..
తుర్కపల్లి, అక్టోబర్, 11 (జనంసాక్షి)……
బిఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయిని కాదని స్వలాభం కోసం పార్టీ మారిన నువ్వు పార్టీ గురించి మాట్లాడడం ఏమిటని టిఆర్ఎస్ అధికార ప్రతినిధి తలారి శ్రీను, ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ ని ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులను అనుభవించి పార్టీ మారగానే కన్నతల్లి ఇలాంటి టిఆర్ఎస్ పార్టీని తిడుతుంటే ప్రజలు నమ్మి పరిస్థితిలో లేరని అన్నారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీలను అంతా ఒకటే అని చెప్తూ అంగదొక్కే తత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం యువ నాయకులకు లేనిపోని ఆశలు కల్పిస్తూ వారి ఎలుగుదలను నాశనం చేస్తున్నారని అన్నారు. మేకపోతు గాంభీర్యం చూపిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో అధికారంలో రాయడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు జేరిపోతుల బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు బోయినిసత్తయ్య, కనకరాజు, నరసింహారెడ్డి, భాస్కర్, మహేష్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.