బిఆర్ఎస్‌ పార్టీలోకి చేరికలు

బిఆర్ఎస్‌ పార్టీలోకి చేరికలు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 21 : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్‌ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది. మలహర్ రావు మండలం తాడిచర్ల చెందిన సుమారు 30 మంది యువకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అలాగే మంథని మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన సుమారు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలవెని పావని సమ్మయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు