బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి హరిప్రియా గెలుపు నకు కృషి చేయాలి

బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి హరిప్రియా గెలుపు నకు కృషి చేయాలి

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్21(జనంసాక్షి)నవంబర్ 30వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో స్దానిక ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియా గెలుపునకు సమిష్టిగా కృషి చేయాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలంలోని మర్రిగూడెం సమీపంలో ఉన్న శ్రీ వేట వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గంగావత్ లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన బిఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధులు గా పాల్గొని మాట్లాడారు. బిఆర్ ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేసి బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియా గెలుపునకు అహర్నిశలు పాటుపాడాలని కోరారు.నవంబర్ 1వ తేదీన జరగనున్న సియం కేసీఆర్ బహిరంగ సభకు మండలం నుండి ప్రజలను భారీగా తరలించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపిపి మూడ్ శివాజీ చౌహాన్, సర్పంచ్ లు,ఎంపిటీసి లు భూక్య బుజ్జి, బి.భారతీ,వి‌.జానకి రాణీ,ఎ.బన్సీలాల్,డి.సక్రు, శీలం శెట్టి రమేష్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్,కో- అప్షన్ సభ్యులు ఖదీర్,నియోజకవర్గ, మండల నాయకులు బానోత్‌ హరిసింగ్ నాయక్, పానుగంటి రాధాకృష్ణ,ఎల్.ఉమేష్‌, బి.మురళీ, ఎన్.నరసింహ, బి.హరిలాల్, ఆలయ కమిటీ చైర్మన్ బానోత్‌ అమర్ చంద్, పార్టీ అనుబంధ సంఘాలు, అన్ని గ్రామ శాఖ ల అధ్యక్షులు పాల్గొన్నారు.