బీఆర్ఎస్ లో చేరికలు.

బీఆర్ఎస్ లో చేరికలు.

బెల్లంపల్లి, అక్టోబర్ 14, (జనంసాక్షి )
బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలం మాదారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు నరేష్, యువనాయకులు అశోక్, కమలాకర్, భీమయ్య, మల్లయ్య, రమేష్, రాకేష్, శివ కృష్ణ, ప్రవీణ్, ఆనంద్, ఆకాష్, వెంకటేష్, సంతోష్, దానిల్, మహిళా నాయకురాలు తీరుపతమ్మ, సుగుణ, వీరక్క, లక్ష్మి ఇతర పార్టీలకు చెందిన 45 మంది నాయకులు కార్యకర్తలు తాండూర్ మండల మాజీ జెడ్పీటీసీ మంగపతి సురేష్ ఆధ్వర్యలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివరించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ ఉంటుందని, బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు