బీజేపీ, టీడీపీ విప్‌ జారీ

న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టనున్న సందర్భంగా బీజేపీ, టీడీపీ తమ నేతలకు విప్ జారీ చేసింది. సభ్యులు తప్పనిసరిగా రాజ్యసభకు హాజరుకావాలని పార్టీలు ఆదేశాలు జారీ చేశాయి. రాజ్యసభకు మంత్రులు కూడా హాజరుకావాలని బీజేపీ సూచించింది.