బీజేపీ పాలన..విద్యారంగంపై అమర్థ్యసేన్ ఆందోళన..

  • 0
    Share

ఢిల్లీ : విద్యారంగంలో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకొంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్థ్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వ భావాలు చొప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని తన తాజా పుస్తకం ‘ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బాయ్స్’లో వెల్లడించారు. యూపీఏ హాయంలోనూ జోక్యం ఉన్నా పరిధి దాటలేదని పుస్తకంలో పేర్కొన్నారు. పరిశోధనా సంస్థలకు అధిపతులుగా హిందుత్వ వాదుల నియమించారని తెలిపారు. మోడీ భగవంతుడి అవతారం అంటూ ప్రచారం చేసే లోకేష్ చంద్రకు ఐసీసీ ఆర్ ఛైర్మన్ పదవి..హిందూత్వ ప్రచారం తప్ప చరిత్ర అంతగా తెలియని యల్లాప్రగడ సుదర్శన రావుకు ఐసీహెచ్ఆర్ ఛైర్మన్ పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. హిందుత్వ భావాలు చొప్పించేందుకే బీజేపీ ఆశ్రితులకు విద్యారంగంలో ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని తెలిపారు.